న్యూఢిల్లీ: ఢిల్లీ నగరమంతటా 11 వేల వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఇక్కడ ప్రకటించారు.వీటిలో నాలుగు వేల హాట్ స్పాట్లు బస్టాప్ల్లో ఏర్పాటుచేస్తారు. ఏడు వేలు మార్కెట్లలో అమరుస్తారు. దీంతో నగరమంతా ఇంటర్ నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు. తొలి 100 హాట్స్పాట్లను ఈ నెల 16న ప్రారంభించ నున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు వ్యయం చేస్తారు. దశల వారీగా 500 వంతున నగర మంతటా విస్తరిస్తామని విపులీక రించారు. మొత్తం ఆరు నెలల్లో 11 వేల హాట్స్పాట్లు సేవలకు సిద్ధమవుతాయని చెప్పారు. ఒక్కో వ్యక్తి నెలకు 15 జీబీల ఇంట ర్నెట్ డాటాను ఉపయోగించుకోవచ్చు. 2015 శాసనసభ ఎన్నికల్లో చేసిన హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పారు.