అమెరికాను కదిలించిన అమృత ప్రణయ్ కథనం..

అమెరికాను కదిలించిన అమృత ప్రణయ్ కథనం..

గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యోదంతం అమెరికాను సైతం కదిలించింది. అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా వెలువడే వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక.. ప్రణయ్ హత్యోదంతంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పత్రిక వెబ్ సైట్ లోనూ దీన్ని పొందుపరిచింది.`A young Indian couple married for love. Then the bride’s father hired assassins..` అనే హెడ్ లైన్ తో వార్త వాషింగ్టన్ డీసీ వెబ్ సైట్ లో ద్వారా ప్రపంచానికి అందించారు. ప్రణయ్, అమృత వర్షిణ ప్రేమ ఎలా మొదలైందనే అంశంతో పాటు.. హత్యకు దారి తీసిన కారణాలు, నాటి పరిస్థితులను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు.అందులో ప్రణయ్‌,అమృతల చిన్నప్పటి స్నేహం నుంచి ప్రేమగా మారిని పరిస్థితులు, వివాహం,ఆసుపత్రి ఆవరణలో ప్రణయ్‌ హత్య కేసు తదితర వివరాలతో సహా కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు దళిత సంఘాల ప్రతినిధులు స్పందించిన తీరు, కేసును వాదించిన న్యాయవాదిని సైతం కథనంలో ప్రస్తావించారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత జీవన స్థితిగతులు, కుమారుడు జన్మించడం, అమృత తండ్రి మారుతి రావు నైజాన్ని ఈ కథనంలో స్పృశించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos