గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతం అమెరికాను సైతం కదిలించింది. అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా వెలువడే వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక.. ప్రణయ్ హత్యోదంతంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక వెబ్ సైట్ లోనూ దీన్ని పొందుపరిచింది.`A young Indian couple married for love. Then the bride’s father hired assassins..` అనే హెడ్ లైన్ తో ఈ వార్త వాషింగ్టన్ డీసీ వెబ్ సైట్ లో ద్వారా ప్రపంచానికి అందించారు. ప్రణయ్, అమృత వర్షిణ ప్రేమ ఎలా మొదలైందనే అంశంతో పాటు.. హత్యకు దారి తీసిన కారణాలు, నాటి పరిస్థితులను ఉటంకిస్తూ ఈ ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు.అందులో ప్రణయ్,అమృతల చిన్నప్పటి స్నేహం నుంచి ప్రేమగా మారిని పరిస్థితులు, వివాహం,ఆసుపత్రి ఆవరణలో ప్రణయ్ హత్య కేసు తదితర వివరాలతో సహా కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు దళిత సంఘాల ప్రతినిధులు స్పందించిన తీరు, ఈ కేసును వాదించిన న్యాయవాదిని సైతం ఈ కథనంలో ప్రస్తావించారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత జీవన స్థితిగతులు, కుమారుడు జన్మించడం, అమృత తండ్రి మారుతి రావు నైజాన్ని ఈ కథనంలో స్పృశించారు..
A young Indian couple married for love. Then the bride’s father hired assassins. https://t.co/qSPERGlxMJ
— The Washington Post (@washingtonpost) August 19, 2019