వరంగల్‌లో మరో దారుణం..

వరంగల్‌లో మరో దారుణం..

వరంగల్‌ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో బాలిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏళ్ల మైనర్ బాలిక నానమ్మ వద్ద ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతుంది. హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన తనకు పరిచయస్థులైన తిరుపతి, ప్రసన్నకుమార్ అనే ఇద్దరు యువకులు మాయామాటలు చెప్పి బాలికను పెంబర్తికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.ఇద్దరితో పాటు మరో మైనర్ బాలుడు కూడ బాలికపై అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.ఇంటికి వచ్చిన బాలిక విషయాన్ని నానమ్మకు చెప్పింది. అత్యాచార ఘటనతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు బాలికపై అత్యాచారానికి పాల్పడిన తిరుపతితో పాటు మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ప్రసన్నకుమార్ పరారీలో ఉన్నాడు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos