లఖ్నవు: ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఠంచనుగా రోజూ ఉదయం తొమ్మిది గంటలకు విధులకు హాజరు కావాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ఆదేశించారు. వేళకురాని సిబ్బంది వేతనాన్ని కోత కోస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన ప్రవర్తన లేని ఉద్యోగులను విధుల నుంచి తప్పిస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం మొదలయింది.