రాంఛి: జార్ఖండ్, హజారిబాగ్లో 105 సంవత్సరాల మహిళ సోమవారం వోటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె తనయుడు తల్లిని కేంద్రానికి భుజంపై మోసుకు వచ్చారు. తను ఏ విధమైన తడబాటు లేకుండా వోటు వేసారు. ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్సభ ఎన్నికలకు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బిహార్, జమ్ము కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐదో విడత పోలింగ్ జరుగుతోంది.