తమిళంలో హీరోగా ఎదిగి ప్రస్తుత నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న తెలుగు కుర్రాడు విశాల్ కొద్ది రోజుల క్రితం అనీషా అనే తెలుగు నటితో చేసుకున్న నిశ్చితార్థం రద్దయినట్లు సమాచారం.హైదబాద్లో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య విశాల్,అనీషా నిశ్చితార్థం జరిగింది.అక్టోబర్ 9వ తేదీన వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు.ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం బయటకి రానప్పటికీ అనీషా మాత్రం పెళ్లి బ్రేక్ చేసుకోవాలని నిర్ణయించుకుందని టాక్. కానీ విశాల్ మాత్రం ఆమెను ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట.ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్ట్ లు పెట్టే అనీషా సడెన్ గా తన నిశ్చితార్ధపు ఫొటోలన్నీ తొలగించింది.అలానే విశాల్ ఫోటోలను కూడా డిలీట్ చేసింది. విజయ్ దేవరకొండ నటించి పెళ్లిచూపులు,అర్జున్రెడ్డి చిత్రాల్లో అనీషా నటించారు..