కొద్ది రోజుల క్రితం 2020లోకి అడుగుపెట్టడం ద్వారా కొత్త ఏడాదితో పాటు కొత్త దశాబ్దం కూడా ప్రారంభం కావడంతో నెటిజన్లు,పలు రంగాల ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో దశాబ్ద కాలంలో జ్ఞాపకాలను పోస్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కొహ్లీ సైతం దశాబ్ద కాలానికి ప్రస్తుతానికి తన జీవితం ఎలా మారిందో చెప్పడానికి ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. అప్పట్లో ఫ్లిప్ ఫ్లాప్ చెప్పులతో, ఇప్పుడు ప్యూమా క్రికెట్ షూలతో ఉన్నానని ఆయన ట్వీట్ చేశాడు. చేతుల్లో చెప్పులు పట్టుకొని 10 ఏళ్ల క్రితం ఓ జలపాతం వద్ద దిగిన ఫొటోను ఆయన షేర్ చేశాడు. తాజాగా కుడి చేతిలో ప్యూమా షూలు పట్టుకొని దిగిన మరో ఫొటోను పోస్ట్ చేశాడు.’దశాబ్దం ప్రారంభంలో, దశాబ్దం ముగింపు‘లో అని ఆయన ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టాడు. విరాట్ కోహ్లీని ప్యూమా బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్న విషయం తెలిసిందే.