టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్తో జరిగిన నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఆటగాళ్లు మెక్గ్రాత్ ఫౌండేషన్కు సహాయం చేసేందుకు గులాబీ రంగు గ్లౌజులు, క్యాప్లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ ఫౌండేషన్కు నిధుల సేకరణకు గానూ ఆరోజును ‘పింక్ డే’గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోహ్లీసేన కూడా మద్దతు తెలిపింది. దీంతో కోహ్లీకి మెక్గ్రాత్ ధన్యవాదాలు తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గులాబీ రంగు టోపీలు, గ్లౌజులు ధరించి వచ్చిన విరాట్ కోహ్లీకి, అతడి జట్టుకు ధన్యవాదాలు. మీవల్లే మేం నిర్వహించిన పింక్ డేకి నిజమైన కళ వచ్చింది. మీరు అద్భుతమైన సందేశాన్నిచ్చారు. కోహ్లీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఆట విషయానికొస్తే కోహ్లీ ఆటతీరు నాకెంతో ఇష్టం. అతడు దూకుడుగానే ఉంటాడు. కోహ్లీలో ఎంతో మానవత్వం ఉంది. జట్టును సారథిలా కాకుండా సాటి మనిషిలా నడిపించే వాడే నిజమైన సారథి. కోహ్లీలో అలాంటి ప్రత్యేకతను నేను చూశాను. మైదానంలోనే కాదు బయట కూడా కోహ్లీ వ్యక్తిత్వాన్ని నేను గమనించాను. గొప్పదనానికి కోహ్లీ ప్రతీక. కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో బయట కూడా అలాగే ఉంటాడు. నిజానికి అలా ఉండటం చాలా కష్టం. కానీ సారథనేవాడు అలాగే ఉండాలి. నాకు ప్రత్యేకంగా అతనంటే ఎంతో అభిమానం ఉంది’ అని చెప్పుకొచ్చాడు.