తిరుమలలో వీఐపీ దర్శనాల రద్దు

తిరుమలలో వీఐపీ దర్శనాల రద్దు

తిరుపతి : తిరుమలలో వీఐపీలకు ఇస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీలు సైతం ఏడాదిలో ఒకసారే శ్రీవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తితిదే పాలకమండలి సభ్యులను 10 రోజుల్లో సీఎం నియమిస్తారని తెలిపారు. అంతకుముందు తిరుపతిలో తితిదే బర్డ్ ఆస్పత్రిని తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos