ప్రస్తుత సచివాలయాన్నే కూల్చేసి అక్కడే కొత్త సచివాలయం నిర్మించడానికి సీఎం కేసీఆర్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారో కేసీఆర్ మనసులో దాగిఉన్న ఉద్దేశమేమిటో తనకు తెలుసనని కాంగ్రెస్ మహిళ నేత విజయశాంతి తెలిపారు.ఈ విషయమై ఫేస్బుక్లో సందేశం పెట్టిన విజయశాంతి ఇప్పుడున్న సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయాన్ని ఎందుకు నిర్మించడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న కారణాలు తెలిశాక ఆశ్చర్యపోయానన్నారు. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని బైసన్పోల్ మైదానంలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానని ప్రకటించిన కేసీఆర్ బైసన్పోల్ మైదానం కోసం కేంద్రంలో పైరవీలు కూడా చేశారన్నారు.అయితే హఠాత్తుగా బైసన్పోల్ మైదానం వదిలేసి ఇప్పుడున్న సచివాలయాన్నే కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టడం వెనుక అసలు విషయాన్ని కొంతమంది తెరాస నేతలు తమకు చెప్పారన్నారు.బైసన్ పోలో గ్రౌండ్లో సచివాలయాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు.కొత్త సచివాలయంలోకి వెళ్లిన వెంటనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ కలలు కన్నారని గులాబీ నేతలు తనకు చెప్పారని విజయశాంతి గుర్తు చేసుకొన్నారు.బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టిన రోజు నుంచి తన వ్యూహాలన్నీ బెడిసి కొడుతుండడంతో కేసీఆర్లో ఆందోళన మొదలైనట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని పేర్కొన్నారు.దీంతో పాత సచివాలయ ప్రాంగణంలోనే పునర్నిర్మాణం చేసి, డిజైన్ మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం ఉందని విజయశాంతి ఆ పోస్టులో కేసీఆర్పై సెటైర్లు వేశారు.సచివాలయాన్ని మార్చడమేమో గానీ.. కేసీఆర్ మైండ్ సెట్ మారకపోతే సీఎం పదవి నుండి ఆయనను మార్చేందుకు తెలంగాణ ప్రజలు వెనకాడరని… ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం గుర్తుంచుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు..