తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ మహిళ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ గెలుపు అసలు గెలుపే కాదని ప్రజలను మాయ చేసి ఎన్నికల్లో గెలిచారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విజయవాంతి మండిపడ్డారు.ఇతరులపై ఆరోపణలు చేసి తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తుంటారని విమర్శించారు.ఎన్నికల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ప్రధాని మోదీ గెలిచారంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ 2014 ఎన్నికల్లో తాను చేసిందేంటో గుర్తు చేసుకోవాలని చురకలు అంటించారు.తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని 2014 ఎన్నికల్లో నువ్వు గెలవలేదా అంటూ కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి చేసినంత మాత్రానా గెలువాలని గ్యారెంటీ లేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్నికలంటే ఆయనకు భయం పట్టుకుందని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికలు సమయం సమీపిస్తోన్న వేళ కేసీఆర్ స్వరంలో మార్పు వచ్చిందని గుర్తుచేశారు. అంతేకాదు జమిలీ ఎన్నికలకు కేసీఆర్ ఆమోదం తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ మాట సంగతేంటని ప్రశ్నించారు. దీనిని బట్టి కేసీఆర్ నైజం ఏంటో అర్థమవుతుందని విమర్శించారు..