అనారోగ్యంతో బాధ పడుతూ కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నసీనియర్ నటి,దర్శకురాలు విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే తన చివరి రోజు ఎప్పుడనేది విజయనిర్మల ముందే చెప్పారంటూ చికిత్స అందించిన కాంటినెంటల్ వైద్యులు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.అనారోగ్యం నుంచి కోలుకొని త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారంటూ తాము చెప్పగా `పోవడం .. ఉండడం మన చేతిలో లేదు. నేను ఎప్పుడు పోయినా ఆరోజు గురువారం అవుతుంది“అంటూ చెప్పారని వైద్యులు గుర్తు చేసుకున్నారు. అన్నట్లుగానే గురువారమే తుదిశ్వాస విడిచారు.మొదటి నుంచి సాయిబాబా భక్తురాలైన విజయనిర్మల సాయిబాబా పూజలు అందుకునే గురువారం రోజే మృతి చెందడం అదే రోజే తన చివరిరోజని ముందే చెప్పడం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ మరణం నేపథ్యంలో మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. విజయనిర్మలకు అత్యంత ఇష్టుడు ఎవరు? అంటే మనవడు నవీన్ కృష్ణ గురించే చెబుతున్నారంతా. నవీన్ ప్రస్తుతం హీరోగా కెరీర్ కోసం శ్రమిస్తున్నారు. నవీన్ను పెద్ద హీరోగా చూడాలని అనుకున్నారట.తన ఆస్తిలో మెజారిటీ వాటాను కూడా నవీన్ కే రాసిచ్చేశారని.. కొడుకు కంటే ఎక్కువ వాటా నవీన్ కే దక్కిందని తెలుస్తోంది.దీపం ఉండగానే చక్కదిద్దుకునే అలవాటు తనకు ఉంది. అందుకే ఎంతో తెలివిగా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఎకరాల్లో ఉన్న తోటను కొనిపించారట. ప్రస్తుతం అక్కడే విజయనిర్మల పార్థీవ దేహాన్ని ఉంచారు. ఈ శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని సీనియర్ నరేష్ ప్రకటించారు.