ముంబై: ప్రధాని మోదీ పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులను ‘‘హత్య చేశారని’’ మహారాష్ట్ర మాజీ విద్యా మంత్రి వసంత్ పుర్ఖే ఆరోపించారు.శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘పుల్వామాలో మోదీ 40 మందిని చంపారు. నేను అడుగుతున్నాను మోదీ. మీరే 40 మంది జవాన్లను చంపేసి, తర్వాత పాకిస్తాన్పై దాడులంటూ ఈ నాటకాన్ని మొదలు పెట్టారు. మీరు ఎవరు? దారి కాచి చంపే దొంగ’అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీర్, పుల్వామా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కారు బాంబు దాడికి పాల్పడటంతో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రెండు వారాల తర్వాత భారత వైమానిక దళాలు పాకిస్తాన్, బాలాకోట్లోని . జైషే మహ్మద్కు ఉగ్ర స్థావరాలపై దాడులు చేసాయి.