ముంబై: విప్లవ కవి వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలని బాంబే హైకోర్టును ఆయన తరపు లాయర్ సుదీప్ పస్బోలా మంగళవారం కోరారు.‘వరవరరావు ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. మరికొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉంది. ఒక వేళ ఆయన చనిపోతే. కుటుంబసభ్యుల మధ్య ఆయన చని పోయేలా చూడాలి. ఈ వయసులో విచారణను ఆయన ప్రభావితం చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. ఈ విషయంలో ఎన్ఐఏకు కూడా భిన్నాభిప్రాయాలు లేవు. కరోనా కూడా సోకడంతో ఆయన పరిస్థితి పూర్తిగా విషమించింద’ని విపులీకరించారు. ‘వర వర రావును చూసేందుకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని కల్పి స్తాం. కోవిడ్ బాధితులను ఎవరూ కలవకూడద’ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది అన్నారు. ‘కొంత దూరం నుంచైనా వరవరరావును కుటుంబసభ్యులు చూసే అవకాశం ఉందా?ని ధర్మాసనం ప్రశ్నించింది. బుధవారంలోగా తమకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.