‘వంగవీటి కుటుంబాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంది’

‘వంగవీటి కుటుంబాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంది’

విజయవాడ: వంటవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది. ఈ నెల 25న ఆయన సైకిలెక్కుతారని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు పనిచేస్తామని రాధా అభిమానులు అంటున్నారు. రాధా భవితవ్యంపై ఆయన అనుచరులు, అభిమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తాము రాధా వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వంగవీటి కుటుంబాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుందని విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాధాకు సీటు మార్చడం సరికాదని అన్నారు. జగన్ పాలకొల్లులో పోటీ చేస్తారా? అని అభిమానులు ప్రశ్నించారు. రాధా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము కట్టుబడి ఉంటామని అన్నారు. మరోవైపు రాధా రాజీనామాకు మద్దతు పలుకుతూ విజయవాడలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఇవాళ తమ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి లేఖలు పంపారు. మాట తప్పం, మడం తిప్పం అన్న జగన్.. రాధా విషయంలో మాట తప్పారని ఓ కార్పొరేటర్ విమర్శించారు. రాధాని అవమానించిన వైసీపీకి కాపు నేతలు ఎవరూ ఓట్లు వేయవద్దని వారు పిలుపు ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos