అమరావతి: ఉండవల్లిలో కృష్ణా కరకట్ట లోపలి అక్రమ నిర్మాణాల్లో పదింటికి సీఆర్డీఏ అధికారులు శనివారం తొలగింపు తాఖీదుల్ని జారీ చేశారు. తులసీ గార్డెన్స్, లింగమనేని రమేష్, చందన బ్రదర్స్, నరసాపురం లోక్సభ మాజీ సభ్యుడు గోకరాజు గంగరాజు, పాతూరి సుధారాణి, శైవ క్షేత్రంలోని ఆరుగురికి తాఖీదులు ఇచ్చారు. కృష్ణానది నుంచి కరకట్టకు మధ్యలో ఉన్న భవనాలన్నింటికీ తాఖీదులు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.