భోపాల్ : ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ప్యూన్లు, డ్రైవర్లు, వామాన్ ల కోసం సర్కారు చేసిన ప్రకటనకు 11,000 మంది దరఖాస్తు చేసారు. ఉత్తరప్రదేశ్ నుంచి కూడా అభ్యర్థులు తరలి వచ్చారు. 10వ తరగతి విద్యార్హత అవసరమైన ఈ ఉద్యోగాలకు స్నాతకోత్తరులు, ఇంజనీర్లు, న్యాయశాస్త్ర పట్టభద్రులు, పీహెచ్ డీ చేసిన వారూ వచ్చారు.‘నేను డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. సివిల్ జడ్జి పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాను. పుస్తకాలు కొనేందుకు డబ్బు లేదు. అందుకే నాకు ఏదో ఒక పని కావాలి’’ అని జితేంద్ర మౌర్య అనే అభ్యర్థి తెలిపాడు.