జగన్.. మోదీతో లాలూచి తగదు

జగన్.. మోదీతో లాలూచి తగదు

భువనేశ్వర్: ‘రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో ఇలా లాలూచీ పడటం సరికాదు’ అని ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా శనివారం చేసిన ట్వీట్లో ముఖ్యమంత్రి జగన్ కు హితవు పలికారు. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్రెడ్డి వంటి పెద్ద నాయకుడి కుమారుడివై ఉండి సీబీఐ, ఈడీ దాడులకు భయపడి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో ఇలా లాలూచీ పడటం సరికాదు. మీరు ఎదగాలి జగన్. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు’ అని విమర్శించారు. మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి, జమ్ము, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని ఫోన్ సంభాషణ తర్వాత హేమంత్ సోరెన్ ‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అని హిందీలో ట్వీట్ చేశారు. దీన్ని ఎం జగన్ శుక్రవారం ట్వీట్ లో ఆక్షేపించారు. ‘‘ప్రియమైన హేమంత్ సోరెన్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మన మధ్య ఎన్ని విభేదాలున్నా ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని, అది మన జాతిని బలహీనపరుస్తుందని ఒక సోద రుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కొవిడ్పై పోరాడుతున్నాం. ఇది ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే తరుణం కాదు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనమంతా చేయీచేయి కలిపి ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది’ అని పేర్కొన్నారు.దీనికి సప్తగిరి ఉలాకా రీట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos