యోగిపై హూకరించిన ఉద్ధవ్

యోగిపై హూకరించిన ఉద్ధవ్

ముంబై : నోయిడాలో ఫిల్మ్ సిటీ కోసం పెట్టుబడిదారులను బలవంతంగా, భయపెట్టి తీసుకెళ్తానంటే కుదిరే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాధ్ను హెచ్చరించారు. ‘రెండు రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఉండడం మంచిదే. బెదిరించి పెట్టుబడిదారులను తీసుకెళ్తే ఊరుకునే ప్రసక్తే లేద’ని హూంకరించారు. నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు కోసం బుధవారం మహారాష్ట్ర ఫిల్మ్ సిటీ పెట్టుబడిదారులతో ఆదిత్యనాథ్ సమావేశం కానున్నారు. ‘ఇండియన్ మర్చంట్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఉద్ధవ్ మాట్లాడారు.‘పారిశ్రామిక వేత్తలకు మహారాష్ట్ర అయస్కాంతం లాంటిది. ఇప్పటికీ ఆకర్షిస్తున్నాం. రాష్ట్రంలోని పెట్టుబడి దారులు ఎవ్వరూ బయటికి వెళ్లరు. అంతేకాదు.. బయటి రాష్ట్రాల వారు మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారు. రాష్ట్రంలోని వారు రాష్ట్రంలోనే ఉంటార’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos