జైపూర్ : స్పైస్ జెట్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 189 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి దుబాయ్కు బయలు దేరిన స్పైస్ జెట్ విమానం టైర్ ఒకటి పేలిపోవడంతో అత్యవసరంగా విమానాన్ని నేలకు దించారు. విమాన సిబ్బందితోపాటు ప్రయాణీకులంతాక్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. టైరు పగిలినందుకు గల కారణాల్ని నిపుణుల బృందం పరిశీలిస్తోంది.