మరో పాతికేళ్లు ‘మహా’ పట్టం శివసేనకే

మరో పాతికేళ్లు ‘మహా’ పట్టం శివసేనకే

ముంబై: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే’ అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ శుక్రవారం ఒక మాధ్యమ సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మరో మారు కుండ బద్ధలు కొట్టారు. ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన నేత రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారా? లేదా ఐదేళ్లు ఉంటారా? అనే ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. ‘ఐదేళ్ల గురించి ఎందుకు చర్చించుకోవాలి? మరో 25 ఏళ్లు మహారాష్ట్రకు సీఎంగా శివసేన నేతే ఉండాలని మేము కోరుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తుది నిర్ణయం తీసుకుంటారు. అధిక సీట్లు సాధించిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద’ని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు ముగిసినట్లు తెలిసింది. ఐదేళ్ల పాటు శివసేన నేతే సీఎంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos