అమరావతి :వచ్చే మార్చిలోగా మరో పన్నెండు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయన సమితికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు లోక్సభ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా పరిగణించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాల సంఖ్య 13 నుంచి 25 కి పెరుగుతుంది.