టీవీ9 సంస్థలో జరిగిన అక్రమాలకు సంబంధించి టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్తో పాటు సినీనటుడు శివాజీపై కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే.కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు పంపించిన నోటీసులకు స్పందించకుండా రవిప్రకాశ్తో పాటు శివాజీ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.అయితే కొద్ది రోజుల క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయిన రవిప్రకాశ్ విచారణకు సహకరించకుండా పోలీసులను ఇబ్బంది పెడుతున్నాడు. రవిప్రకాశ్ నుంచి నిజాలు కక్కించడానికి పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఈ తరుణంలో టీవీ9 వివాదాలకు సంబంధించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ శివాజీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.గత సంవత్సరం ఫిబ్రవరి 19న ఏబీసీఎల్ 40వేల షేర్ల కొనుగోలు కోసం రవిప్రకాశ్కు రూ.20లక్షలు బ్యాంకు ద్వారా చెల్లించానని..అయితే ఎన్సీఎల్టీలో వివాదం తర్వాత షేర్లు బదిలీ చేస్తానని రవిప్రకాశ్ చెప్పారని పిటిషన్లో శివాజీ పేర్కొన్నారు.రవిప్రకాశ్తో లావాదేవీలు కుట్ర పూరితమని వచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారని శివాజీ తెలిపారు. కనీసం విచారణ జరపకుండా పోలీసులు కేసు నమోదు చేశారని..తనపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని శివాజీ కోరారు.