దసరా నాటికి జిల్లా కార్యాలయాలు

దసరా నాటికి జిల్లా కార్యాలయాలు

హైదరాబాద్ : పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులకు నిర్దేశించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే 29 జిల్లాల్లో శంకుస్థాపనలు పూర్తయ్యాయి. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన బాధ్యులకు ఈ సందర్భంగా చెక్కులు అందజేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును, భవన నిర్మాణ ప్రణాళికను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పోడు భూముల వ్యవహారాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. త్వరలో వీటన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos