తెరాస ఎమ్మెల్యే అసహనం..

తెరాస ఎమ్మెల్యే అసహనం..

మంత్రివర్గ విస్తరణ అనంతరం తెలంగాణలో అధికార తెరాసపై ఎమ్మెల్యేలు,నేతలు ఒక్కొక్కరిగా అసహనం,అసంతృప్తి వెల్లగక్కుతున్నారు.మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారంటూ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శలు చేయగా తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సైతం తెరాసపై అసంతృప్తి వ్కక్తం చేశారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో తనకు పని లేనందునే పరీక్షలు రాస్తున్నానని.. ఏదైనా పదవి ఇస్తే పని చేస్తానని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ఏ పని లేకపోతే విదేశాలకు వెళ్తానని స్పష్టం చేశారు.ఇక వినాయక మండపంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఎదురైన ప్రశ్నకు.. ఆర్మూర్ ప్రజలు తనను దైవంలా ఆరాధిస్తారని.. అందులో తప్పేముందన్నారు.ఏళ్ల తరబడి పని చేస్తున్నా.. మీ విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదు.. తనను ఆరాధిస్తూ విగ్రహాలు పెట్టిన వాళ్లను ఎలా నియంత్రించగలను అంటూ జీవన్రెడ్డి బదులిచ్చారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos