ముంబై:స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఉదయం 9.40గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 138 పాయింట్లు నష్టపోయి 38,928 వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 11,706 వద్ద ట్రేడయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.78 వద్ద దాఖలైంది.
మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్కార్ప్, ఎల్అండ్టీ, పీఎన్బీ హౌసింగ్, డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో,. ఓఎన్జీసీ, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.