పొగాకు ఉత్పత్తుల నిషేధం మరో ఏడాది

పొగాకు ఉత్పత్తుల నిషేధం మరో ఏడాది

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గుట్కా, పాన్ మసాలా సహా ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, అమ్మకాలు పై నిషేధాన్ని ఢిల్లీ ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ‘ప్రజా ఆరోగ్య ప్రయోజనార్థం ఏడాది కాలం పాటు దేశ రాజధాని పరిధిలో పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాం. గుట్కా, పాన్ మసాలా, ఫ్లేవర్డ్ లేదా సెంటెడ్ టొబాకో, ఖర్రా సహా ఎలాంటి పదార్ధాలతో కూడిన పొగాకు మిశ్రామానికీ అనుమతి లేదు’ అని ఆహార భద్రతా వ్యవహారాల కమిషనర్ ఎల్ఆర్ గార్గ్ శుక్రవారం జారిచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిగరెట్ల పై నిషేధం విధించకపోవడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos