రైలులో నుంచి టిక్టాక్ వీడియో కోసం ఎంతో ప్రమాదకరంగా స్టంట్ చేసిన ఓ వీడియోపై కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయెల్ తీవ్రంగా స్పందించారు. అలాంటి ప్రమాదకర చేష్టలను వ్యక్తుల మూర్ఖత్వంతో పోల్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘ఓ యువకుడు టిక్టాక్ వీడియో రూపొందించే క్రమంలో ప్రమాదకరంగా రైలుకు వేలాడుతూ ప్రయాణం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడి కాలు అదుపుతప్పి నేలకు తగలడంతో నియంత్రణ కోల్పోయి రైలు నుంచి కింద పడిపోతాడు. కేవలం అంగుళాల వాసిలో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడు’ ఇది వీడియో సారాంశం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ దృష్టి వెళ్లింది. దీంతో ఆయన ట్విటర్ ద్వారా తీవ్రంగా స్పందించారు. ఆ వీడియో పోస్ట్ చేస్తూ.. ‘కదులుతున్న రైలులో ఇలాంటి సాహసాలు చేయడం ధైర్యం చేయడం అనుకుంటున్నారా.. కాదు.. అది మూర్ఖత్వం మాత్రమే అని అన్నారు. ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి సాహసాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
चलती ट्रेन में स्टंट दिखाना बहादुरी नही, मूर्खता की निशानी है। आपका जीवन अमूल्य है, इसे खतरे में ना डालें।
नियमों का पालन करें, और सुरक्षित यात्रा का आनंद लें। pic.twitter.com/tauidfOqRj
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) February 18, 2020