టిక్‌టాక్‌ తిక్క…రైల్వే మంత్రి ఆగ్రహం

రైలులో నుంచి టిక్‌టాక్‌ వీడియో కోసం ఎంతో ప్రమాదకరంగా స్టంట్‌ చేసిన ఓ వీడియోపై కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయెల్‌ తీవ్రంగా స్పందించారు. అలాంటి ప్రమాదకర చేష్టలను వ్యక్తుల మూర్ఖత్వంతో పోల్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘ఓ యువకుడు టిక్‌టాక్‌ వీడియో రూపొందించే క్రమంలో ప్రమాదకరంగా రైలుకు వేలాడుతూ ప్రయాణం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడి కాలు అదుపుతప్పి నేలకు తగలడంతో నియంత్రణ కోల్పోయి రైలు నుంచి కింద పడిపోతాడు. కేవలం అంగుళాల వాసిలో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడు’ ఇది వీడియో సారాంశం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ దృష్టి వెళ్లింది. దీంతో ఆయన ట్విటర్‌ ద్వారా తీవ్రంగా స్పందించారు. ఆ వీడియో పోస్ట్‌ చేస్తూ.. ‘కదులుతున్న రైలులో ఇలాంటి సాహసాలు చేయడం ధైర్యం చేయడం అనుకుంటున్నారా.. కాదు.. అది మూర్ఖత్వం మాత్రమే అని అన్నారు. ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి సాహసాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos