జంతర్ మంతర్‌లో రైతుల మహాపంచాయత్

జంతర్ మంతర్‌లో రైతుల మహాపంచాయత్

న్యూఢిల్లీ : ఇక్కడి కిసాన్‌ మహాపంచాయత్ నిరసన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.  సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, ఘాజీపూర్, నోయిడా, ఢిల్లీ ఛిల్లా సరిహద్దుల్లో సాయుధ పోలీసులను నియమించారు. నగరంలో 144 సెక్షన్ ను విధించారు. సాయుధ పోలీసులు సరిహద్దుల్లో అవరోధాల్ని ఏర్పాటు చేసి రైతుల రాకను నిరోధించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినా రైతులతో కూడిన బస్సు సింఘూ సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి వచ్చింది. తిక్రీ సరిహద్దుల్లో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఘాజీపూర్ వద్ద రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల నిరసన కార్యక్రమాలు, పోలీసుల భారీ బందో బస్తుతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos