రాజ్యాంగాన్ని, రైతుల‌ను కాపాడాలి

న్యూ ఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ మాట్లాడారు. రాజ్యాంగాన్ని, రైతులను కాపాడాలని దేశ ప్రజలకు విన్నవించారు. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రైవేటు సంస్థల గురించే ఆలోచిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో కాకుండా కంపెనీల చేతిలో నడుస్తోందని దుయ్యబట్టారు. వాటి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సింది ప్రజలేనని విన్నవించారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో పలు ప్రైవేటు సంస్థలు రైతుల భూములపై కన్ను వేశాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఈ దేశాన్ని ఆయా కంపెనీలకు అమ్ముతోందని తప్పుబట్టారు. రైతులకు మద్దతు తెలుపుతోన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. విభజించు, పాలించు విధానంలో ముందుకు వెళ్తున్న కేంద్ర సర్కారు విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. నియంతలా వ్యవహరిస్తున్న సర్కారుకి దీటుగా బదులివ్వాలివ్వాలని పిలుపు నిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos