పాత్రికేయుడి హత్య కేసులో ముగ్గురు పోలీసులపై వేటు..

పాత్రికేయుడి హత్య కేసులో ముగ్గురు పోలీసులపై వేటు..

కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు సత్యనారాయణ హత్య ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.హత్యకు గురైన సత్యనారాయణతో పాటు మరో పాత్రికేయుడు కరుణలు గతంలో దాడి జరిగిన సమయంలోనే తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ విన్నవించినా పోలీసులు నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలడంతో తుని రూరల్ ఎస్ఐ, శ్రీకాకుళం జిల్లా జులుమూరు ఇంచార్జ్ ఎస్ఐ, ఏఎస్ఐలను విధుల నుంచి తొలగించాలని డీజీపీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పుడే స్పందించి, విచారణ జరిపించి, బాధితులకు రక్షణ కల్పించాల్సిందని అభిప్రాయపడ్డ డీజీపీ, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణ చర్యలకు ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos