పలు కంపెనీలకు భూమి పూజ

పలు కంపెనీలకు భూమి పూజ

హోసూరు : ఇక్కడికి సమీపంలోని బేలతూరు గ్రామంలో రూబెన్ పథకం కింద రూ.57 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మించే సిమెంట్ ఇటుకల తయారీ కంపెనీ, రెండు  గ్లౌసుల తయారీ కంపెనీలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శశి వెంకటస్వామి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర  ప్రభుత్వం పేదల అభివృద్ధి కి గాను ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ఎందరో పేదలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఇప్పుడు రూబెన్ పథకం ద్వారా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి పేదల అభివృద్ధికి కృషిచేస్తున్నదని వివరించారు. ఈ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని శశి వెంకటస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నారాయణస్వామి, బేలతూరు పంచాయితీ అధ్యక్షులు ఎం. మునిరాజ్, జిల్లా కౌన్సిలర్ రవి కుమార్, ఎడిఎంకె కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos