పొంచి ఉన్నకరోనా ముప్పు

న్యూ ఢిల్లీ: వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ లో మరోసారి కరోనా విలయతాండవం చేయనుందని సమాఖ్య ప్రభుత్వం హెచ్చరించింది. పండుగలను కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించింది. కరోనా రెండోదాడి ఇంకా ముగియనేలేదు. గతంలో ప్రతి పండుగ తర్వాత కేసులు పెరిగిన సంగతి మరువద్దని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. టీకా వేసుకున్నా మూతి గుడ్డ ధరించడం ముఖ్యమ న్నారు. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు గురువారం దేశవ్యాప్తంగా అమాంతం పెరిగాయి. మృతుల సంఖ్యా పెరిగింది. రోజు రోజుకు కరోనా కేసుల్లో పెరుగుదల మూడో దాడికి సంకేతమంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos