దేవాలయాల్లో చోరీలు

దేవాలయాల్లో చోరీలు

హోసూరు : ఇక్కడికి సమీపంలోని మత్తిగి పోలీసు స్టేషన్ పరిధిలో ఒకే రోజు అయిదు  దేవాలయాల్లో వరుస చోరీలు జరగడం సంచలనం సృష్టించింది. మత్తిగి సమీపంలోని నాగొండపల్లి గ్రామంలో గల సంజీవరాయ స్వామి దేవాలయం, గంగమ్మ దేవాలయం తాళాలు పగులగొట్టి బంగారు తాళి బొట్టు, రెండు దేవాయల్లోని హుండీలను ధ్వంసం చేసి సుమారు రూ.20 వేల నగదును దోచుకెళ్లారు. నాగొండపల్లి గ్రామంలోని కుంటమ్మ గుడి తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించిన దుండగులు విఫలమయ్యారు. అనంతరం నాగొండపల్లి సమీపంలోని యడేనల్లూరు గ్రామంలోని రెండు దేవాలయాల్లో బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం అర్ధ రాత్రి దుండగులు దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఈ సంఘటనలపై మత్తిగిరి పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos