బీజేపీ నాయకుడి ఇంట్లో చోరీ

హొసూరు : స్థానిక బీజేపీ నాయకుని ఇంట్లో దొంగలు చొరబడి తొమ్మిది తులాల బంగారు నగలు, పంచ లోహ విగ్రహాన్ని తస్కరించారు. బీజేపీ రాష్ట్ర శాఖలో ప్రముఖ నాయకుడైన హొసూరుకు చెందిన నరేంద్ర కుటుంబం వారం రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లింది. నరేంద్ర పార్టీ పనులపై చెన్నై వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటి తలుపు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారు, నరేంద్ర కుటుంబ సభ్యులు వచ్చారేమోనని వెళ్లి చూడగా, ఎవరూ కనిపించలేదు. దీంతో వారు అవాక్కయ్యారు. దొంగలు బీరువాలో ఉన్న వస్తువులను దొంగలించారని నరేంద్ర కుటుంబానికి ఇరుగు పొరుగు వారు తెలియజేశారు. అనంతరం బంగారం, పంచలోహ విగ్రహం తస్కరణకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హొసూరు పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos