వాహనాలకూ భౌతిక దూరం..

వాహనాలకూ భౌతిక దూరం..

కరోనా దెబ్బతో ప్రస్తుత పరిస్థితులు కరోనాకు ముందు కరోనా తరువాతలా తయారయ్యాయి.కరోనా కారణంగా భారీ ప్రాణనష్టం వాటిల్లడం శోచనీచమే అయినా కరోనా వల్ల మనుషుల్లో కొద్దిగా మార్పు కనిపిస్తోంది.గతంలో స్వచ్ఛతకు ఏమాత్రం విలువ ఇవ్వని మనుషులు ప్రస్తుతం భౌతిక దూరం పాటించడం,కరచాలనం విడనాడడం,ఆహారపు అలవాట్లను సైతం మార్చుకున్నారు.ప్రతి అంశంలోనూ దూరం తప్పనిసరిగా పాటించడం అలవాటు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో వాహనాల మధ్య సైతం దూరం ఉండేలా హైదరాబాద్‌ పోలీసులు దేశంలోనే మొదటిసారిగా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నద్ధమయ్యారు. ఇప్పటివరకూ దాన్ని పాటిస్తున్న వారి సంఖ్య నామమాత్రమే. దీంతో.. మహమ్మారి మరింతగా విస్తరించే వీలుంది. ప్రమాదాన్ని పసిగట్టిన తెలంగాణ పోలీసు శాఖ తాజాగా కొత్త టెక్నాలజీని తెర మీదకు తీసుకొచ్చింది. దేశంలో మరెక్కడా లేని విధంగా.. డీప్ లెర్నింగ్ పద్దతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఆసరాగా చేసుకొని రోడ్ల మీదకు వచ్చే వాహనాలు సైతం భౌతిక దూరాన్ని పాటించేలా చేస్తారు.ఇందులో భాగంగా హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని రద్దీ ప్రాంతాల్ని ఆన్ లైన్ లో కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తుంటారు. ఇందుకు ఆయా రహదారుల్లో ఉన్న కెమేరాల ద్వారా లైవ్ లో చూస్తే.. భౌతిక దూరాన్ని పాటించని వాహనాల్ని గుర్తిస్తారు. తొలి దశలో అలాంటి వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. విధానంలో ట్రాఫిక్ జాంలను గుర్తించటం.. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లను అలెర్టు చేయటం ద్వారా.. రోడ్ల మీద ట్రాఫిక్ నిలిచి పోవటం.. భౌతిక దూరం లేని కారణంగా తలెత్తే సమస్యల్ని పరిష్కారించాలన్నదే తెలంగాణ పోలీసుల ఆలోచనగా చెబుతున్నారు. అదిరేలా ఉన్న ఐడియా ప్రాక్టికల్ గా అమలు చేసే వేళ..  ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos