ప్రస్తుతం
మహిళలు లేని రంగమంటూ ఏదీ లేదేమో అంటే అతిశయోక్తి కాదేమో.వంటలు చేయడం దగ్గరి నుంచి యుద్ధ
విమానాలు నపడం వరకు ప్రతీ రంగంలోనూ పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళుతున్నారు.ఈ క్రమంలో
తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా కమెండో బృందం విధులు నిర్వర్తించడానికి సిద్ధమైంది.కరీంనగర్
కమిషనరేట్ పరిధిలో 43 మంది మహిళా పోలీసులతో మొదటి మహిళా కమెండో బృందాన్ని ఏర్పాటు
చేసారు.కొద్ది కాలం క్రితం ఇజ్రాయిల్ యుద్ధతంత్ర కళ క్రావ్మగాలో కఠోర శిక్షణ పూర్తి
చేసుకున్న 43 మంది మహిళా కమెండోల బృందం కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్కుమార్,కమిషనర్
కమలాసన్రెడ్డి సమక్షంలో తాము నేర్చుకున్న పలు యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు.దీంతోపాటు
ఆర్ఎస్ఎస్ మురళి నేతృత్వంలో క్రావ్మగా యుద్ధవిన్యాసాల్లో శిక్షణ పొందిన ఈ మహిళ
కమెండోల బృందం మరిన్ని యుద్ధకళలు నేర్చుకుంటున్నారు.త్వరలోనే అన్ని యుద్ధకళల్లో నిష్ణాతులుగా
ఆరితేరి మహిళ కమెండోల బృందం విధులకు హాజరవడానికి సిద్ధమవుతోంది..