హైదరాబాదు: కథానాయిక తాప్సి మళ్లీ సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటోంది. తమిళ సినిమా-అన్నాబెల్లె చిత్రీకరణను ఈ మధ్యే ముగించింది. ‘భయ పడుతూ కూర్చుంటే ఏమీ చేయ లేము. అందుకే జాగ్రత్తలన్నీ తీసుకుని అన్నాబెల్లె షూటింగు పూర్తి చేశాము. ఇక హసీనా దిల్ రుబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా సినిమాల షూటింగులలో పాల్గొనాల్సి ఉందని వివరించింది.