హైదరాబాద్ : ఎమ్మెల్యేల కోటా నుంచి శాసన మండలిలో ఓ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు తెరాస అభ్యర్థిని ఖరారు చేసింది. నవీన్రావును ఎంపిక చేయాలని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నవీన్రావుతో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ గతంలో వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఒకే స్థానం ఖాళీ అయినందున నవీన్రావును ఎంపిక చేశారు. త్వరలో మరో మూడు స్థానాలు ఖాళీ అవుతాయి. అప్పుడు గుత్తాకు అవకాశం కల్పించవచ్చని తెరాస వర్గాలు తెలిపాయి. మల్కాజిగిరి ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు ఎన్నికవడంతో ఎగువ సభ పదవికి రాజీనామా చేశారు.