తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన దైవభక్తి మరోసారి నిరూపించుకున్నారు.ఇప్పటివరకు నదులకు మాత్రమే ఉన్న దేవతల పేర్లను బ్యారేజీలు, పంప్ హౌస్లకు పెట్టి కొత్త చరిత్ర సృష్టించారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు బ్యారేజీలు,పంప్హౌస్లకు దేవతామూర్తులు పేర్లు పెట్టి దేవుళ్లపై భక్తిని చాటుకున్నారు.మేడిగడ్డ బ్యారేజీకి లక్ష్మీ బ్యారేజీగా, కన్నెపల్లి పంప్హౌస్కి లక్ష్మీ పంప్హౌస్గా నామకరణం చేశారు. అదేవిధంగా అన్నారం బ్యారేజీకి సరస్వతి బ్యారేజీగా, సిరిపురం పంప్హౌస్కు సరస్వతి పంప్హౌస్గా కేసీఆర్ నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతోపాటు సుందిళ్ల బ్యారేజీకి పార్వతి బ్యారేజీగా, గోలివాడ పంపుహౌస్కు పార్వతి పంపుహౌస్గా నామకరణం చేయగా, నంది మేడారం జలాశయానికి నంది పేరును లక్ష్మీపురం పంపుహౌస్ కు గాయత్రి పేరు పెట్టారు..