ఇంగిత జ్ఞానం లేని తెదేపా

ఇంగిత జ్ఞానం లేని తెదేపా

అమరా వతి: తెదేపా నేతలపై ముఖ్య మంత్రి జగన్ మండి పడ్డారు. మంగళ వారం శాసన సభలో ప్రసంగించారు. ‘దాదాపుగా మూడు గంటల నుంచి చూస్తున్నా అధ్యక్షా. తెదేపా నేతలు సభాపతి వేదిక దగ్గరకు రావడం, అమరావతికి జై అని నినాదాలు చేయడం. ఎందుకు అమరావతి జై అంటున్నారో వారికే తెలియద’న్నారు. ‘ఒక వైపు ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక కమిషన్ల ఏర్పాటుకు చారిత్రాత్మక ముసాయిదాను ప్రవేశపెడుతుంటే తెదేపా నేతలు అడ్డుకున్నారు. ఇటువంటి హీనమైన చరిత్ర ఈ దిక్కుమాలిన తేదేపాకి, ఆ పార్టీ సభ్యులకు, చంద్రబాబుకి ఉంది. ఒక వైపు ఆ ముసాయిదా మండలి ఆమోదం పొందకుండా అడ్డుకున్నారు. మరోవైపు మళ్లీ అటువంటి దిక్కుమాలిన ఆలోచనలతో ఇక్కడకూ వస్తున్నార’ని వ్యాఖ్యానించారు. ‘సభలో వైకాపా సభ్యులు ఏదైనా మాట్లాడడం మొదలు పెడితే చాలు తెదేపా నేతలు అరుస్తున్నారు. చర్చను జరగనివ్వకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసా. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ము సా యిదాను తెదేపా నేతలు అడ్డుకుంటున్నారు. ఎస్సీలకు చంద్ర బాబు న్యాయం చేయలేదు. మేము న్యాయం చేస్తున్నా మ’ని పేర్కొ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos