తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అభిమానగణం ఉన్న నటుల్లో తారక్ అగ్రస్థానం ఉంటారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.సరైన సినిమా పడితే తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ను శాసించగలనని తారక్ ఇప్పటికే ఒకట్రెండు చిత్రాలతో నిరూపించుకున్నారు కూడా.అటువంటి ఎన్టీఆర్ ఏదైనా చిత్రంలో అథిధి పాత్రలో కనిపించాలంటే సాధారణమైన విషయమా?సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉంటే అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఎన్టీఆర్ వంటి నలుడు అథిధి పాత్రలో నటించడానికి అంగీకరించడు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ చిత్రంలో అథిధి పాత్రలో నటించడానికి తారక్ అంగీకరించినట్లు తెలుస్తోంది.కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలో నాగేంద్ర అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో కీలకమైన అథిధి పాత్రలో నటించడానికి తారక్ అంగీకరించినట్లు తెలుస్తోంది.హీరో సినిమాలో గెస్ట్ గా కనిపించటం కన్నా ఇలా మహిళా ప్రధాన పాత్రలో నడిచే సినిమాలో కనిపించే గెస్ట్ రోల్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఎన్టీఆర్ భావిస్తున్నారు. సినిమాలో దాదాపు పది నిముషాలు పాటు సాగే ఈ కామియో కు సంభందించిన నేరేషన్ ఇప్పటికే ఎన్టీఆర్ విన్నారట. అయితే ఫైనల్ గా ఓ సారి మొత్తం విని తను మాత్రమే చేయగలిగే పాత్ర అయితే చేస్తానని మాట ఇచ్చారట. ఈ గెస్ట్ రోల్ లో చేయమని ఎన్టీఆర్ సన్నిహితుడు, పి ఆర్ మహేష్ కోనేరు స్వయంగా ఎన్టీఆర్ ని అడిగారట.ఈ చిత్రానికి దర్శకుడు మణిరత్నం క్లాసిక్ టైటిల్ సఖిని పరిశీలిస్తున్నారు..