విజయవాడ: తానా సభల్లో భాజపా నేత రాం మాధవ్ ను అవమానించినందుకు ఆ పార్టీ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ట్విట్టర్లో ఖండించారు. ‘అవి తానా సభలు కావు.తెదేపా భజన సభల’ని ఎద్దేవా చేసారు. పచ్చ తెలుగు తమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగు వారి ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆగ్రహించారు. రాంమాధవ్ ప్రసంగానికి లోకేశ్ ముఠా అడ్డు తగిలి మరోసారి తమ నీచబుద్ధిని ప్రదర్శించారని దుయ్యబట్టారు. తెదేపా బురద రాజకీయాల నుంచే కమల వికాసం జరుగుతుందన్నారు. తానా 22వ మహాసభలకు హాజరైన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ప్రసంగించినపుడు ఆహూతుల్లో చాలా మంది ఈలలు, కేకలు వేసి ఆయన వేదిక నుంచి దిగి పోవాలని నినాదాలు చేశారు. దీంతో మాధవ్ తన ప్రసంగాన్ని అర్థంతరంగా ఆపేసారు.