తోక జాడిస్తే పంజ్‌షీర్‌కు పట్టిన గతే పడుతుంది

తోక జాడిస్తే పంజ్‌షీర్‌కు పట్టిన గతే పడుతుంది

కాబూల్ : పంజ్షీర్ ప్రావిన్స్ను చేజిక్కించుకున్న తాలిబన్లు సమస్యలు సృష్టించాలని చూస్తే పంజ్షీర్కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. కాబూల్లో సోమవారం విలేఖరులతో తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడారు. ‘యుద్ధం ముగిసింది. ఇక ఆఫ్ఘనిస్థాన్ సుస్థిరంగా ఉంటుంది. ఎవరైనా ఆయుధాల వైపు చూసినా, వాటిని ముట్టినా వారు ఈ దేశానికి, ప్రజలకు శత్రువులుగా మారతారు. చొరబాటుదారులు ఎప్పుడూ మన దేశ పునర్నిర్మాణం చేయలేరు. ఇది ప్రజల బాధ్యత. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు న్లు ప్రయత్నించాం. చర్చల కోసం ప్రయత్నిస్తే ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తలతిక్క సమాధానాలు ఇచ్చింది. దేశం నుంచి పరారైన వారు ఇంకామాతో యుద్ధం చేస్తున్నామనే అనుకుంటున్నారు. మేమైతే ఎప్పటికీ శాంతినే కోరుకుంటున్నాం. ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే పంజ్షీర్లో ఏం జరిగిందో చూశారు. పంజ్షీర్ను స్వాధీనం చేసుకున్నప్పుడు మేము పౌరులెవరికీ ఎలాంటి హానీ తలపెట్ట లేద’న్నారు. తిరుగుబాటు దళాలతో ఉన్న ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలే గురించి తాలిబన్లు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.తాలిబన్లతో యుద్ధానికి దిగిన వారిని క్షమించేసినట్టు చెప్పారు. ఆఫ్ఘన్ దళాల్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తాలిబన్ దళాల్లో చేరాల్సిందిగా కోరుతామని పేర్కొన్న జబీహుల్లా పంజ్షీర్లో త్వరలోనే విద్యుత్, ఇంటర్నెట్ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos