కాబూల్ : ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు చర్యల్ని చేపట్టారు. ఇందుకు వీలుగా ప్రభుత్వ అధికారులందరినీ క్షమించినట్లు ప్రకటించారు. అధికారులందరూ పూర్తి విశ్వాసంతో విధుల్లోకి చేరాలని సూచించారు. రోజువారీ కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొనాలని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.