తెదేపా నేతలతో తలసాని సంప్రదింపులు…

తెదేపా నేతలతో తలసాని సంప్రదింపులు…

రెండవసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వాన్ని త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఓడించేందుకు పావులు కదుపుతున్నారు.ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ పర్యటిస్తున్న తలసాని తెదేపాకు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న బీసీలను తెదేపాకు దూరం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేఃశారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో యాదవ గర్జన పేరుతో బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా నిర్ణయించుకున్నారు.అయితే అందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తుండడంతో తలసాని శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే ఇక బీసీ నేతలను ప్రతిపక్షం వైసీపీలో చేర్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.అందులో భాగంగా మొదటగా తన సామాజిక వర్గానికి చెందిన వరసకు వియ్యంకుడయ్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను కొద్ది రోజులుగా వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం తిరుమల తిరపతి దేవస్థానాల ఛైర్మన్‌గా ఉన్న పుట్టాకు త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనున్న నేపథ్యంలో తలసాని ప్రతిపాదనకు ఎటువంటి స్పందన ఇవ్వలేదని తెలుస్తోంది.ఇక పుట్టాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మరికొంత మంది తెదేపా నేతలతో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంప్రదింపులు జరుపుతూ వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos