మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ట్రైలర్కు అన్ని భాషల్లో అద్భుత స్పందన లభిస్తోంది.తెలుగు రాష్ట్రాలతో పాటు చిరంజీవి అభిమానులు ఎక్కువగా ఉన్న చెన్నై,బెంగళూరు నగరాల్లోని పలు థియేటర్లలో సైతం ప్రదర్శిస్తున్న సైరా చిత్రం ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలోని కొన్ని థియేటర్లు అభిమానుల అభిమానాన్ని క్యాష్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సైరా ట్రైలర్ వీక్షించడానికి అభిమానుల నుంచి రూ.100 టికెట్ ధర వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ట్రైలర్ చూడడానికి రూ.100 చెల్లించి టికెట్ కొన్న కొంతమంది దీన్ని ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది..