అమరావతి: ముఖ్యమంత్రి గా తన ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాలని వైకాపా అధినేత జగన్ చేసిన ఆహ్వానాన్ని మాజీ ముఖ్యమంత్రి , తెదేపా శాసనసభా పక్షం నేత చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. తనకు బదులుగా ఇద్దరు సీనియర్ నాయకుల్ని పంపాలని చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన శాసనసభా పక్షం తీర్మానించింది. గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ను తెదేపా పార్లమెంటరీ నేతగా, శ్రీకాకుళం విధాన సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడిని దిగువ సభ నేతగా, రాజ్యసభలో తెదేపా సుజనా చౌదరిని నియమించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయం అందరికీ అందుబాటులో లే నందును విజయవాడకు మార్చాలయని పలువురు నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. విజయవాడలో తెదేపా తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు బాధ్యతను కేశినేని నానికి అప్పగించారు.