న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎన్నికైన 25 మంది లోక్సభ సభ్యులచే సోమవారం తాత్కాలిక సభాపతి వీరేంద్ర కుమార్ ప్రమాణాలు చేయించారు. అరకు సభ్యురాలు గొడ్డేటి మాధవి ముందుగా తెలుగులో ప్రమాణం చేశారు. తర్వాత 12 మంది తెలుగులో, 11 మంది ఇంగ్లీషులో, ఇద్దరు హిందీలో ప్రమాణాలు చేశారు. శ్రీకాకుళం టీడీపీ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు హిందీలో ఈశ్వరుడి సాక్షిగా, విజయనగరం వైకాపా సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ తెలుగులో పవిత్ర హృదయంతో, విశాఖపట్నం వైకాపా సభ్యుడు సత్యనారాయణ తెలుగులో దేవుడి సాక్షిగా, అనకా పల్లి వైకాపా సభ్యుడు డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి తెలుగులో దైవసాక్షిగా, కాకినాడ వైకాపా సభ్యుడు వంగా గీతా విశ్వనాథ్ తెలుగులో దైవసాక్షిగా, అమలా పురం వైకాపా సభ్యులు చింతా అనురాధ హిందీలో, రాజమండ్రి వైకాపా సభ్యులు మార్గాని భరత్ తెలుగులో దైవ సాక్షిగా, నరసాపురం వైకాపా సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, ఏలూరు వైకాపా సభ్యుడు కోటగిరి శ్రీధర్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, మచిలీ పట్నం వైకాపా సభ్యుడు వల్లభనేని బాలశౌరి తెలుగులో పవిత్ర హృదయంతో, విజయవాడ తెదేపా సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, గుంటూరు తెదేపా సభ్యుడు గల్లా జయదేవ్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, నర్సరావుపేట వైకాపా సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, బాపట్ల వైకాపా సభ్యుడు నందిగం సురేశ్ తెలుగులో దైవసాక్షిగా, ఒంగోలు వైకాపా సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, నంద్యాల వైకాపా సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, కర్నూల్ వైకాపా సభ్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, అనంతపురం వైకాపా సభ్యుడు తలారి రంగయ్య తెలుగులో పవిత్ర హృదయంతో, హిందూపురం వైకాపా సభ్యుడు గోరంట్ల మాధవ్ ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, కడప వైకాపా సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి తెలుగులో దైవ సాక్షిగా, నెల్లూరు వైకాపా సభ్యుడు ఆదాల ప్రభాకర్రెడ్డి తెలుగులో దైవ సాక్షిగా, తిరుపతి వైకాపా సభ్యుడు బల్లి దుర్గా ప్రసాదరావు ఇంగ్లీషులో దేవుడి సాక్షిగా, రాజంపేట వైకాపా సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంగ్లీషులో దేవుడి, చిత్తూరు వైకాపా సభ్యుడు రెడ్డెప్ప తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణాలు చేశారు.