కోల్ కతా: భాజపా రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తాకు చేదు అనుభవాన్ని చవి చూసారు. ఇక్కడి విశ్వ భారతి విశ్వ విద్యా ల యం ఆవరణలో బుధవారం సాయంత్రం జరిగిన సభలో ఆయన నూతన పౌరసత్వ చట్టానికి అనుకూలంగా ప్రసంగిం చినపుడు అదే చోట ఆరు గంటల పాటు విద్యార్థులు ఆయన్నునిర్బంధించారు. పౌరసత్వం చట్టం గురించి ప్రసంగించడానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించకుండా కేవలం భాజపా రాజ్యసభ సభ్యుణ్ని మాత్రమే ఆహ్వానిం చారని ఉప కులపతిపై కూడా విద్యార్థులు మండి పడి నిరసన చేపట్టారు. ‘సమావేశం ప్రశాంతంగా కొనసాగుతున్న సమయంలో ఒక మూక దాడి చేయడం ఎంత వరకు సబబు? విశ్వభారతిలో నేను ప్రసంగి స్తుండగా ఓ గదిలో నిర్బంధించార’ని గురువారం ట్విట్టర్లో తెలిపారు.